15 April, 2026 | 12:09 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉపాధి హామీ రక్షణ కోసం 23న జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

20-12-2025 05:27 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ఉపాధి హామీ రక్షణ కోసం23న జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఏఐఎఫ్బీ రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి తెలిపారు. శనివారం అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం పార్టీ ఆఫీసులో జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కొట్లాడి సాధించుకున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునేందుకు గ్రామీణ ప్రజలంతా కలిసికట్టుగా నడవాలని, ఈ నెల 23 ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు  జయ్రపదం చేయాలని, వామపక్ష పార్టీల నేతలతో కలసి పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో యూత్ లీగ్ రాష్ట్ర కన్వినర్ రావుల ఆదిత్య, నగర అధ్యక్షులు సత్యారావు, జిల్లా కమిటీ సభ్యులు బద్రినేత, ప్రశాంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.