16 April, 2026 | 11:53 AM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి

05-01-2026 01:52 AM

నూతనకల్ సర్పంచ్ మల్లికార్జున్

నూతనకల్, జనవరి 4: గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని నూతనకల్ గ్రామ సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్ కోరారు.ఆదివారం గ్రామంలోని ప్రధాన వీధులలో కొత్తగా ఏర్పాటు చేసిన వీధిలైట్లను ఆయన పర్యవేక్షించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని, అన్ని రంగాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.

వీధిలైట్ల ఏర్పాటుతో చీకటి సమస్య తొలిగిందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని, అభివృద్ధి పనుల్లో ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఉప్పుల వీరు యాదవ్, బండి అనిల్, బత్తిని లింగయ్య, సంగినేని సురేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.