22 June, 2026 | 2:56 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

అనంతగిరి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

05-01-2026 01:50 AM

కోదాడ (అనంతగిరి) జనవరి 4: అనంతగిరి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నకిరికంటి వీరబద్రమ్మ పాలక వర్గం, శ్రీకర హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డేగ కొండయ్య , కొండపల్లి వాసు పాల్గొని  ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోనీ ప్రజలు మెరుగైన వైద్య సేవలు కోసం ప్రైవేట్ హాస్పటల్ కు వెళ్లకుండా గ్రామంలోనే రక్త పరీక్షలు ఈసీజీ మందులు అందజేస్తున్నారని తెలిపారు.

ఈ మెగా వైద్య శిబిరంలో 200 మంది గ్రామస్తులు పాల్గొన్నారు  అడగగానే వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శ్రీకర హాస్పటల్ యాజమాన్యానికి  డాక్టర్ రాజేందర్‌కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో  ఉప సర్పంచ్ గవిని రామకృష్ణ వార్డు మెంబర్లు రవి వెంకటయ్య వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సూర్యం హాస్పిటల్ యాజమాన్యం లచ్చిరెడ్డి గ్రామ పెద్దలు  సంగబోయిన అంతయ్య నకిరికంటి యల్లయ్య గాదం వెంకన్న మార్తి వేణు తదితరులు పాల్గొన్నారు.