13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఐనవోలు జాతరకు ఏర్పాట్లను పూర్తి చేయాలి

09-01-2026 10:14 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఐనవోలు జాతరకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లను పూర్తి చేసి జాతరను విజయవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఈనెల 13 నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దేవాదాయ, పంచాయతీ రాజ్, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, ఇతర శాఖల ఆధ్వర్యంలో ఇప్పటివరకు చేసిన జాతర ఏర్పాట్లు వాటి పురోగతి గురించి సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులుకు ఎక్కడ కూడా ఇబ్బందులకు కలగకుండా అధికారులు సమన్వయంతో జాతరలో సేవలందించాలని తెలిపారు. ముందుగా ఆలయానికి వచ్చిన కలెక్టర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు శేషవస్తాలను అందించి ఆశీర్వాచనం చేసి తీర్థప్రసాదలను అందజేశారు.