వర్చువల్గా కోర్టుకు అల్లు అర్జున్ హాజరు
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు విచారణకు సోమవారం హీరో అల్లు అర్జున్ వర్చువల్గా హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతివ్వడంతో ముంబై నుంచి అల్లు అర్జున్ వర్చువల్గా అటెండ్ అయ్యారు. ఈ కేసులో అల్లు అర్జున్ను ఏ11గా పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. మిగిలిన నిందితులు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరయ్యారు.
సోమవారం ఉదయం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టు ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. సినిమా షూటింగ్ల కారణంగా అల్లు అర్జున్ ముంబైలో ఉన్నారని, అక్కడి నుంచి వర్చువల్గా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాది మెమో దాఖలు చేయగా.. అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను నాంపల్లి కోర్టు జులై 6కు వాయి దా వేసింది.






