21-06-2025 09:06:10 PM
కరీంనగర్ (విజయక్రాంతి): నగరంలోని వింధ్యావాళి స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన శేషం పార్థసారధి కుటుంబానికి 2002 బ్యాచ్ కు సంబంధించిన విద్యార్థులు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. శేషం పార్థసారథి 1999 నుండి సుమారు 2010 వరకు వింధ్యావాళి స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆయన ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తెలుసుకొని ఏఐసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రుద్ర సంతోష్, 2002 బ్యాచ్ మిత్రబృందం శేషం పార్థసారథి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే సంకల్పంతో పాఠశాలలో సంస్మరణ సభ ఏర్పాటు చేసి లక్ష రూపాయల ఫిక్స్ డిపాజిట్ పత్రాలను శేషం పార్థసారథి భార్య శేషం సరళకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు నమిలకొండ రమణాచార్యులు, విద్యా వాలి స్కూల్ చైర్మన్ లక్ష్మీ, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.