21-06-2025 09:08:12 PM
కొత్తకోట: కొత్తకోట పట్టణ కేంద్రంలో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి(Professor Jayashankar death anniversary) వేడుకలు జై బీసీ జైజై బీసీ చైర్మన్ బీచుపల్లి రాములు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాములు యాదవ్, శ్రీనుజీ, కిషన్ నాయక్, బాలస్వామి, రమేష్ చారీ, వెంకటేష్, వెంకటన్న గౌడ్, కొత్తకోట బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.