04-05-2025 06:23:55 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ లో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. 1999-2020 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహించి చదువులు చెప్పిన గురువులను సన్మానం చేసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.