17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

'అంతడుపుల'ను వరించిన గద్దర్ అన్న ఐకాన్ అవార్డు

04-05-2025 06:30 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణానికి చెందిన తెలంగాణ ధూమ్ ధామ్ సృష్టికర్త అంతడుపుల నాగరాజును గద్దర్ అన్న ఐకాన్-2025 అవార్డు(Gaddar Anna Icon-2025 Award) అందుకున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో  తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేసిన ప్రజా కవులను కళాకారులను గుర్తించి సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవ సంస్థ ఆధ్వర్యంలో శనివారం బిర్లా ప్లానీటోరియంలోని భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Assembly Speaker Gaddam Prasad Kumar), ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల గద్దర్, నిర్వాహకురాలు అలేఖ్యల చేతుల మీదుగా నాగరాజు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డ్ గ్రహీత మాట్లాడుతూ... ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.