6 July, 2026 | 1:18 PM

Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •  

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష

04-05-2025 09:52 PM

మంచిర్యాల (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగింది. నీట్ పరీక్షకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజీవ్ నగర్ తెలంగాణ ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 1,204 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 1,166 మంది అభ్యర్థులు హాజరయ్యారని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను నిబంధనల ప్రకారం పూర్తి బందోబస్తు మధ్య తరలించినట్లు తెలిపారు.