12-06-2025 08:26:17 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్ వాడి కేంద్రాలల్లో నిర్వహిస్తున్న అమ్మ మాట - అంగన్ వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఘట్ కేసర్ మున్సిపల్(Ghatkesar Municipal) పరిధిలోని ఘనపూర్, లింగాపూర్ గ్రామాలలోని అంగన్ వాడి కేంద్రలలో అమ్మ మాట - అంగన్ వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ పాల్గొని ర్యాలీ నిర్వహించి, చిన్నారులతో కలిసి భోజనం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజా ప్రభుత్వం మూడు సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు గల పిల్లలకు, మంచి పౌష్టిక ఆహారం, మంచి విద్యను అందించాలనే ఉదేశ్యంతో ఈకార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ లు ననావత్ రూప్ సింగ్ నాయక్, బద్దం గోపాల్ రెడ్డి, బిబ్లాక్ మహిళా విభాగం అధ్యక్షురాలు బర్ల అనీత, నాయకులు జి. నర్సింహా, వి. గోవర్ధన్ గౌడ్ మరియు అంగన్ వాడి టీచర్లు, కార్యకర్తలు, ఆశ కార్యకర్త, డ్వాక్రా మహిళలు, చిన్నారుల మాతృమూర్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.