18 August, 2026 | 12:27 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

న్యాయం చేయాలని వృద్ధురాలి ఆందోళన

02-09-2025 12:12 AM

కాగజ్‌నగర్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): చింతల మానేపల్లి మండలం డబ్బ గ్రామానికి చెందిన 90 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యులు సోమవారం కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వృద్ధురాలు చాపిడి సోంబాయి కి  సంబంధించిన భూమిని కొందరు వ్యక్తులు ఆమె మృతి చెం దినట్లు రికార్డులు సృష్టించి, పట్టా చేసుకున్నారు.

ఈ విషయంలో వృద్ధురాలు గత నె ల  నాలుగో తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టగా, సత్వరమే  స్పందించిన  సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల స్పష్టమై న హామీ ఇవ్వడంతో వృద్ధురాలు ఆందోళన విరమించింది.   గత రెండు రోజుల క్రితం మళ్లీ ఆ భూమిలో ప్రహరీ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు భూమి పూజ చేయడంతో వృద్ధురాలు పాటు, ఆమె కుటుంబ సభ్యు లు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఆ వృద్ధురాలు అధికారులను వేడుకుంది.   ఆమెతోపాటు కూతుర్లు రుక్మిణి, విమల మనమరాళ్లు లక్ష్మి, జ్యోతి ఆందోళన చేస్తున్న వారిలో ఉన్నారు.  సిపిఎం పార్టీ కార్యదర్శి ముంజం  ఆనంద్ కుమార్, తదితరులు ఆందోళనకు మద్దతు తెలిపారు.