07-01-2026 06:21:34 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి గ్రామంలోని అంగన్వాడీ 2లో బుధవారం చిన్నారులకు అన్నప్రాసన, అక్షరబ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 6 నెలల నుండి 3 ఏళ్లలోపు వయసు గల పిల్లలకు బాలమృతం, కోడిగుడ్లు పంపినీ చేసి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయినా సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్ మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రలా ద్వారా పిల్లలకు అందుతున్న సేవలు అభిందనియమన్నారు. చదువుతో పాటు, అందుతున్న పౌస్టిక ఆహారం సేవలు ఎంతో ప్రయోజనకారంగా ఉంటున్నాయని తెలిపారు.