13 July, 2026 | 9:26 PM

Breaking News

విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •   ఆల్బెండజోల్ మాత్రాల పంపిణి   •   ఇబ్రహీంపేట్ లో వర్షాలు కురవాలని బసవేశ్వర ఆలయంలో జలాభిషేకం   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి   •   ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి   •  

మాల్తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో వైద్య శిబిరం

07-01-2026 06:08 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో బుధవారం వైద్య సిబ్బంది ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ సృజన్ కుమార్ మాట్లాడుతూ... మొన్న మధ్యాహ్నం భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత గురైన సందర్భంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలో వైద్య శిబిరాన్ని నిర్వహించి 46 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అస్వస్థతకు గురైన ఎనిమిది మంది విద్యార్థులకు సైతం వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు.