13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

యువ భారత్‌కు మరో విజయం

18-01-2026 12:00 AM

బులవాయో, జనవరి 17 : అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. తొలి మ్యాచ్‌లో అమెరికాను చిత్తు చేసిన భారత్ తాజాగా రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ౧౮ పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ వైభవ్ సూర్యవంశీ (72), వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు(80) రాణించడంతో భారత్ అండర్ 19 జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ రిఫత్(37), కెప్టెన్ అజీజుల్ హకీమ్ తమీమ్ (51) హాఫ్ సెంచరీతో రాణించడంతో మ్యాచ్ ఆసక్తకరంగా మారింది. మధ్యలో భారీ వర్షం రావడంతో టార్గెట్‌ను 29 ఓవర్లలో 165 పరుగులుగా నిర్ణయించారు. ఇక్కడ నుంచీ భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి పైచే యి సాధించారు. విహాన్ మల్హోత్ర 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు.