22-10-2025 12:00:00 AM
మంచిర్యాల, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : జిల్లాలోని 73 ఏ4 మద్యం దుకాణాలకు ఈ నెల 23వ తేదీ ఆఖరు అని, ఆసక్తి గల వారు సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నందగోపాల్ మంగళ వారం తెలిపారు. ఈ నెల 27న శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపాన గల పీవీఆర్ గార్డెన్స్ లో ఉదయం పది గంటలకు లక్కీ డ్రా పద్దతిలో దుకాణాల కేటాయింపు జరుగుతుందన్నారు.