22-10-2025 12:00:00 AM
ఐజి చంద్రశేఖర్రెడ్డి
నిర్మల్, అక్టోబర్ 2౧ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ మరింత కష్టపడి పని చేయాలని మల్టీ జోన్ వన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ అధికారులు ఆదేశించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసి జిల్లా పోలీసు అధి కారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా లో ఆర్థిక నేరాలతో పాటు శాంతి భద్రతల పర్యవేక్షణ దొంగతనాలు నియంత్రణ పాన్ మట్కా గుట్కా మత్తు పదార్థాల నియంత్రణ పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఏఎస్పీలు అవినాష్ కుమార్ రాకేష్ మీనా ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.