12-02-2025 04:41:45 PM
రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు యెర్రా కామేష్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జైభీమ్ రావు భారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ ఆదేశాలు మేరకు కొత్తగూడెం పట్టణం గాజుల రాజం భస్తీకి చెందిన గంధం మల్లికార్జున రావును ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు యెర్రా కామేష్ బుధవారం నియమించారు. ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ.. ఎవరైతే దెబ్బలు తింటారో వాళ్లే కేకలు వెయ్యాలని చెప్పిన మహాత్మ జ్యోతిబా ఫూలే వ్యాఖ్యలను బహుజనులు ఆదర్శంగా తీసుకొని, సమానత్వం కోసం, తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు మాట్లాడుతూ... త్వరలో జిల్లా వ్యాప్తంగా పర్యటించి జిల్లా కమిటీ నిర్మాణం చేసి తద్వారా పోలింగ్ బూత్ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తానని, పార్టీ బలోపేతం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలను చైతన్యపరిచి వారిని మమేకం చేసి ప్రజా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.
సమతా సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. బహుజనులు నూతన రాజకీయ శక్తిగా ఎదగాలన్నారు. భీమ్ రావు అంబేద్కర్ ఆలోచన విధానమే బహుజనులకు రక్షణ అని తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడుగా నియమించిన జాతీయ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ కు, రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు యెర్రా కామేష్ లకు ధన్యవాదాలు తెలిపారు. గంధం మల్లికార్జున రావు నియామకం పట్ల నాగుల రవికుమార్, వంగా రవిశంకర్, హరికృష్ణ, పూణెం మురళి తదితరులు అభినందనలు తెలిపారు.