10-06-2025 12:52:23 AM
ముషీరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి) : ఆరోగ్య మిత్ర స్వచ్చంద సంస్థ ఆవిర్భవించి 25 ఏళ్లు నిండుతున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో 25 నెలల పాటు ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ వెల్లడించారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వార్షికోత్సవ వాల్ పోస్టర్ ను డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్, గాలి భరత్ రెడ్డి లతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు.
ఈనెల 10వ తేది నుంచి ఈ వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు.. రెండు తెలుగు రా ష్ట్రాలలో 25వేల మందికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యా, వైద్యం, ఆరోగ్యం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని 25 వసంతాలు నిండిన సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలలో ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన పెంపొందిస్తామని తెలిపారు. ప్రజలకు సేవలు అందించడమే ఆరోగ్యమిత్ర సంస్థ లక్ష్యమని దీనిలో భాగం గా పలు కార్యక్రమాలు చేపడుతున్న ట్లు చెప్పారు.
సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమలు ఉచిత మెడికల్ క్యాంపులు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న 25 మందికి సంస్థ తరపున ఉత్తమ అవార్డులను ప్రధానం చేసున్నట్లు తెలిపారు. రాష్ట్ర డిజీపీ చేతుల మీదుగా వాటి పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.