19 May, 2026 | 11:24 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

ఏటీసీలను సద్వినియోగం చేసుకోవాలి

30-07-2025 11:04 PM

ఎంపీడీవో రాజేశ్వర్..

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్(MPDO Rajeshwar) కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఏటీసీ గోడ ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటిఐల స్థానంలో అత్యాధునిక సాంకేతిక శిక్షణ సంస్థలను(ఎటిసి) టాటా టెక్నాలజీస్ సహకారంతో ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఏటీసీల ద్వారా యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించి నైపుణ్యం గల శిక్షకులుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏటీసీలలో చేరి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని స్వయం ఉపాధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ ప్రిన్సిపాల్ దేవానంద్, ఎంపీడీవో కార్యాలయం అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.