24 April, 2026 | 1:51 AM

జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

24-04-2026 12:00 AM

మృతురాలి బంగారు కమ్మలు మాయం...?

జగిత్యాల, ఏప్రిల్ 24 ( విజయక్రాంతి ):జగిత్యాలలోని ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది.మృతురాలి బంగారు చెవి కమ్మలు ఆసుపత్రి సిబ్బంది మాయం చేశారని భాధితులు ఆరోపించారు.గురువారం ఆసుపత్రిలోబంగారు కమ్మలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

జగిత్యాల పట్టణ పోలీసులు రంగప్రవేశం చేసి శాంతింపజేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం జగిత్యాల ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు.చికిత్స పొందుతూ వృద్ధురాలు గురువారం మృతి చెందగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.

అయితే మృతురాలికి చెందిన బంగారు చెవి కమ్మలు కనబడపోయేసరికి బాధితులు జగిత్యాల ఆసుపత్రికి చేరుకునిఆసుపత్రికి చెందిన ఇద్దరు మహిళా సిబ్బంది బంగారు కమ్మలు మాయం చేసారాని ఆరోపిస్తూ ఆసుపత్రిలో ఆందోళన చేశారు.మా బంగారం ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆసుపత్రి అధికారులు,సిబ్బంది, బాధితులతో పోలీసులు మాట్లాడి ఆందోళనను విరామింపజేశారు.