28-07-2025 12:40:05 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగల వీడు స్టేజి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఆటో బావిలో పడ్డ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆటోలో ప్రయాణిస్తుండగా, ఈ ఘటనలో శ్రీరాం నరసయ్య (80) మరణించగా ఆటో డ్రైవర్ శ్రీరామ్ మార్కండేయ, శ్రీరామ్ భారతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో భారతమ్మ పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ ఎంజీఎం తరలించారు. శ్రీరామ్ మార్కండేయను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.