15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రమాద రహిత డ్రైవర్ల అవార్డుల ప్రదానోత్సవం

24-01-2026 09:11 PM

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రతా మాపోత్సవాలలో భాగంగా శుక్రవారం కరీంనగర్-2 డిపోలో ప్రమాద రహిత డ్రైవర్ల అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హాజరై మాట్లాడుతూ... ప్రమాదాల నివారణకు డ్రైవర్లు ఇతర రోడ్డు వినియోగదారులను గమనిస్తూ డ్రైవింగ్ చేయాలని, డిఫెన్సివ్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు.

డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్  పురుషోత్తం మాట్లాడుతూ... ఈ ప్రమాద రహిత సర్వీసు గల డ్రైవర్లను ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకొని ప్రమాద రహిత డ్రైవింగ్ చేయాలని కోరారు. అనంతరం ప్రమాదరహిత డ్రైవర్లకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి  శ్రీకాంత్ చక్రవర్తి,  ఏసీపీలు  వెంకటస్వామి,  యాదగిరి స్వామి, రీజనల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్ భూపతిరెడ్డి,  పి మల్లేశం, పర్సనల్ ఆఫీసర్ జి సత్యనారాయణ, అకౌంట్స్ ఆఫీసర్ ఎ శంకరయ్య, డిపో మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.