12-09-2025 12:00:00 AM
ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): సైబర్ నేరాల నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం సైబర్ క్రైమ్ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న సైబర్ వారియర్స్కు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ అందించిన టీ-షరట్స్ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ప్రతి పోలీస్ సిబ్బంది ఈ రంగంలో పూర్తి అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని, ప్రతి కేసును సీరియస్గా తీసుకుని బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ నేరాలపై నిపుణుల బృందం ప్రజలకు మార్గదర్శనం చేయాలని, ప్రజలకు తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 1930 నంబర్ లేదా www.cybercrime.gov.in ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని తెలిపారు.