4 July, 2026 | 5:26 PM

సైబర్ నేరాలపై అవగాహన

03-05-2025 12:07 AM

చారకొండ, మే 2 : మండలంలోని మర్రిపల్లిలో సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసిం గ్ పై శుక్రవారం ఎస్త్స్ర శంషుద్దీన్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ గ్రామాలలో రో జురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని వాటిపై అప్రమత్తంగా ఉండి జాగ్రత్త లు పాటించాలన్నారు.

అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పకూడదని మొబైల్ యాప్ ద్వారా ఎలాంటి లోన్స్ తీసుకోకూడదన్నారు . కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరేష్ నాయక్, హెడ్ కానిస్టేబుల్ తిరుమలరావు, పీసీలు బాలరాజు, స్వప్న తదితరులు పాల్గొన్నారు.