calender_icon.png 25 June, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు

25-06-2025 05:58:15 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ రూరల్ పోలీస్ వారిచే బుధవారం మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో యాంటీ డ్రగ్ అవగాహన(Anti Drugs Awareness) కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్మల్ గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ మాట్లాడుతూ... విద్యార్థులు చదువు పట్ల దృష్టి పెట్టి మంచిగా చదివి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ సేవిస్తే అనారోగ్యం పాలై మృత్యువుకు దారి తీస్తుందని తెలిపారు. వారి ఇంటి చుట్టూ ప్రక్కల, పాఠశాల పరిసర ప్రాంతాలలో ఎవరైనా డ్రగ్స్ సేవించినట్లు లేదా అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీస్ లకు 1908 సమాచారం ఇవ్వాలని కోరారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎవరు కూడా డ్రగ్స్ కు బానిస కాకూడదని తెలిపారు. తర్వాత గ్రామీణ ఎస్ఐ లింబాద్రి విద్యార్థులచే డ్రగ్స్ కు దూరంగా ఉంటామని డ్రగ్స్ సమాచారం తెలిస్తే పోలీస్ లకు తెలియజేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు పాఠశాలలో "యాంటీ డ్రగ్ అవగాహన" కార్యక్రమంపై విద్యార్థులకు చిత్ర లేఖన పోటీ నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సిద్ధ పద్మ, ఉపాధ్యాయులు సంతోష్, రాజేందర్, చట్ల శ్రీనివాస్, సురేందర్, మోరే శ్రీనివాస్, మసియుద్దీన్, ఆశా కిరణ్, విద్యా రాణి, సునీత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.