20 June, 2026 | 4:08 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

అయ్యప్ప స్వాముల సైకిల్ యాత్ర

26-11-2025 10:42 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన అయ్యప్ప గురు స్వామి భీంరెడ్డి, మీసానిపల్లి గ్రామానికి చెందిన గోపాల్ స్వామి శబరిమలకి సైకిల్ పై యాత్రగా బయలుదేరి వెళ్లారు. గ్రామంలోని గ్రామంలోని మంజీరా నది ఒడ్డున వెయ్యి సంవత్సరాల క్రితం తీరాన వెలసిన మహిమాన్విత శివాలయం అయిన త్రిలింగరామేశ్వర దేవాలయం వద్ద ప్రత్యేక అభిషేకాలు చేసి సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ, అయ్యప్ప దీక్ష స్వాములు, గ్రామపెద్దలు వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు, మాజీ ఎంపీపీ దివిటి రాజదాస్, తాండూర్ సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి, అలయ కమిటీ సభ్యులు సంగమేశ్వర్ రెడ్డి, గంగాధర్, యువ నాయకుడు వంశీ గౌడ్ స్వామి, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, లింగంపేట మండలాలకు స్వాములు పాల్గొన్నారు.