అనుమానాస్పద స్థితిలో శిశువు మృతి
01-03-2026 12:00 AM
నాగర్కర్నూల్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మం డలం పాలెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల బాలుడు నీటి తొట్టిలో అనుమానాస్ప ద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య విభేదాల నేపథ్యంలో బాలుడి తల్లి నీలమ్ పుట్టింటి వద్ద ఉంటోంది.
ఈ క్రమంలో మాట్లాడేందుకు భర్త కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి పాలెం గ్రామానికి వచ్చినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో బాలుడికి పాలు ఇవ్వడానికి చూసుకున్న తల్లికి బాబు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో వెతకగా నీటి తొట్టిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.




