16-12-2024 01:32:05 AM
జగిత్యాల, డిసెంబర్ 15 (విజయక్రాంతి): పేగు బంధాన్ని మరచి, పసికందును బావిలో పడేసిన అమానవీయ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో ఆదివారం పసికందు(బాబు) మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.