13-09-2025 02:46:27 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) సిపిఎం కార్యదర్శి సాదుల శ్రీనివాస్ తల్లి రామ నర్సమ్మ ఇటీవల దివంగతురాలయ్యారు. శనివారం శ్రీనివాస్ ను మహబూబాబాద్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత(BRS District President Maloth Kavitha) పరామర్శించారు. రామ నరసమ్మ చిత్రపటం వద్ద పుష్పం గుచ్చం నుంచి నివాళులర్పించారు. రామ నర్సమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ముత్యం వెంకన్న, మార్నేని రఘు, గుండు సులోచన తదితరులున్నారు.