14 July, 2026 | 6:50 PM

Breaking News

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •  

పొదల్లో శిశువు మృతదేహం లభ్యం

04-08-2025 12:00 AM

మౌలాలిలో కలకలం

మల్కాజిగిరి, ఆగస్టు 3 : మానవత్వాన్ని మంటగలిపే ఘోర ఘటన మౌలాలిలో వెలుగుచూసింది. మౌలాలి ఎస్పీ నగర్ సమీపంలోని కల్లు కాంపౌండ్ పక్కన ఉన్న పొదల్లో ఆదివారం ఉదయం ఓ నవజాత శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమా చారం ఇచ్చారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు అక్క డ వదిలిపెట్టిన కారణంగా శిశువు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.  ఈ దారుణానికి పాల్పడ్డవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిసర కాలనీల్లోని ప్రజలను పోలీసులు విచా రించడంతో పాటు సమీపంలోని ఆసుపత్రులు, ప్రసూతి కేంద్రాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.