06-06-2025 01:05:17 AM
కలెక్టర్ పమేలా సత్పతి
కొత్తపల్లి, జూన్5(విజయక్రాంతి):చిన్నారులకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ నిస్తూ.. వారికి బాల భవన్ ఆత్మీయ నేస్తంగా మారిందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఆడిటోరియంలో విద్యాశాఖ, బాల భవన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతుల ము గింపు కార్యక్రమం నిర్వహించారు.
45 రోజుల శిక్షణ శిబిరంలో సంగీతం, జానపద నృత్యం, శా స్త్రీయ నృత్యం, మృదంగం, కర్ర సాము, అబాకస్, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, చెస్, యోగా అంశాల్లో నిపుణులు సుమారు 938 మంది చిన్నారులకు శిక్షణ ఇచ్చారు ముగింపు వేడుకల్లో చిన్నారుల ప్రదర్శనలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాల భవన్ శిక్షకులు ఓపికగా చిన్నారులకు శిక్షణ నిస్తూ వారిలోని ప్రతిభను వెలికితీస్తున్నారని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులకు కళలపై ఆసక్తి కలుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా విద్యా నియంత్రణ అధికారి అశోక్ రెడ్డి, బాల భవన్ సూప రిండెండెంట్ మంజులా దేవి, ఇన్స్ట్రక్టర్ శ్రీధర్, చిన్నారుల తల్లిదండ్రులు, తదితరులుపాల్గొన్నారు.