06-06-2025 01:05:42 AM
హైదరాబాద్, ౫ (విజయక్రాంతి): ‘ప్రభుత్వం మాకివ్వాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయకుండా స్కూళ్లను నడపటం కష్టంగా ఉంది.. సిబ్బందికి జీతాలెలా ఇవ్వా లి. బంగారం, వెండి, సర్వం తాకట్టుపెట్టి, ఇప్పటి వరకు ఎలాగోలా బండి లాగాం. ఇక నడపటం మావల్ల కాదు. స్కూళ్ల పేరుమీద తీసుకున్న లోన్లు చెల్లించకపోవటంతో బ్యాం కర్లు వచ్చి స్కూళ్లకు నోటీసులు అంటించి వెళ్తున్నారు.
మాకొద్దు ఈ స్కీమ్, మా స్కూ ళ్లను ప్రభుత్వానికే అప్పగిస్తాం.. వారినే నడుపుకోమనండి’ ఇది ఓ ప్రైవేట్ స్కూల్ యా జమాన్యం ఆవేదన. రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ (బీఏసీ)ను అమలు చే స్తున్న ప్రైవేట్ స్కూళ్ల పరిస్థితి ఇది. ఎస్సీ, ఎస్టీ పేద వర్గాల విద్యార్థులను ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసు కొచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం (బీఏఎస్) లక్ష్యం నీరుగారుతోంది.
ఈ పథకం అమలవుతున్న ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి ఆందోళనగా తయారైంది. ఈ స్కీమ్ కింద విద్యార్థులకు ఖర్చయ్యే బిల్లులను ప్రభుత్వం సమయానికి విడుదల చేయకపోవటంతో ప్రైవేట్ పాఠశాలలు నిర్వహణ భారాన్ని తట్టుకోలేకపోతున్నాయి. దీంతో 2025 సంవత్సరం స్కూళ్లను తెరిచే పరిస్థితి లేదని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు వాపోతున్నాయి.
రాష్ట్రవ్యా ప్తంగా 210 స్కూళ్లలో బీఏఎస్ స్కీమ్ అమలవుతోంది. ఒక్కో జిల్లాలో 5 నుంచి 10 వరకు ఈ స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కీమ్ కింద పాఠశాలల్లో మొత్తం 25,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్సీలకు 18 వేలు, ఎస్టీలకు 7 వేల సీట్లు ఉంటాయి. ఈ స్కీం కింద డే స్కాలర్స్, రెసిడెన్షియల్ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యనందిస్తారు. ఎస్సీ విద్యార్థులకు ఒకటో తరగతిలో, 5వ తరగతిలో ప్రవేశాలుంటే, ఎస్టీ విద్యార్థులకు మూడు, ఐదు, ఎనిమిదో తరగతిలో ప్రవేశాలుంటాయి.
ఇందుకుగా నూ హాస్టల్ విద్యార్థి ఒక్కోక్కరికి రూ.42 వే లు, డేస్కాలర్ విద్యార్థికి రూ.28 వేలను ప్రభుత్వం చెల్లిస్తోంది. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఒక్కోక్కరికీ రూ.1.5 లక్షల చొప్పున ఖర్చుచేస్తున్న ప్రభుత్వం.. బీఏఎస్ స్కీం కింద చదువుతున్న వారికి మా త్రం ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.
మూడేళ్లలో రూ.210 కోట్లు పెండింగ్
బీఏఎస్ స్కీమ్ కింద చేరే విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్లు, కా స్మోటిక్స్, మంచి భోజనం అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తమకు నిధులు విడుదల చేయకుంటే ఎలా నిర్వహించాలని యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. స్కూల్ భవనాలకు పన్నులు, కరెంట్ బిల్లులు, సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతున్నారు. మూడు నెలల వేతనాలను సిబ్బందికి చెల్లించాలి.
దీనికి తో డూ నూతన విద్యాసంవత్సరం వస్తోంది. ఈ స్కూళ్లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు మూడేళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం స్కూళ్లకు ఇవ్వాల్సిన నిధులు రూ.210 కోట్లు ఉన్నాయని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. 2022 సంబంధించి రూ. 10 కోట్లు, 2023 రూ.75 కోట్లు, 2024 25కు 125 కోట్లు పెండింగ్లో ఉన్నాయి.
అప్పులు కట్టలేకపోతున్నాం...
జూన్ 12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది. ప్రభుత్వం పెం డింగ్ నిధులను విడుదల చేయకపోవటంతో దాదాపు 100 స్కూళ్ల యాజమాన్యాలు మంగళవారం అత్యవసర సమావేశాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసి తీర్మానం చేశాయి. పెండింగ్ నిధులు విడుదల చేయకుంటే జూన్ 12 నుంచి స్కూళ్లకు తాళాలు వేసి, ఆ తాళాలను ప్రభుత్వానికే ఇస్తామంటున్నారు. తాము స్కూళ్లను నిర్వహిం చలేమని, ప్రభుత్వమే నడుపుకోవాలని ప్రైవే ట్ స్కూళ్ల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. తెచ్చిన అప్పులకు ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాయకుల చుట్టూ తిరుగుతున్నాం..
ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లు లు చెల్లించకుంటే మాకు చావే శర ణ్యం. మేము రాజీవ్ యువవికాసం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి ప్రభుత్వ పథకాలను ఇవ్వమని అడగటం లేదు. మా డబ్బులు మాకి వ్వమని అడుగుతున్నాం. మంత్రు లు, ఎమ్మెల్యే, కలెక్టర్ల చుట్టూ చాలాసార్లు తిరిగి, అలసిపోయాం. ఆఖరికీ సీఎంను కలిసి కూడా మా సమస్య ను విన్నవించాం.
కానీ ప్రభుత్వం ప ట్టించుకోవటం లేదు. ఇక బడులను నడపలేం. ప్రభుత్వం ఇచ్చే స్కూళ్ల అనుమతిపత్రాల (రికగ్నేషన్ సర్టిఫికెట్)లతోపాటు ఉన్నదంతా తాక ట్టుపెట్టి స్కూళ్లను నడిపించాం. ఒక్కో స్కూల్పై రూ.2 కోట్ల వరకు అప్పు ఉంది. ఇక నడపటం మా వల్ల కాదు. స్కూళ్లకు తాళాలు వేసి ప్రభుత్వానికే ఇచ్చేస్తాం. వారిష్టం ఏమైనా చేసుకోండి.
యాదగిరి శేఖర్రావు,
ట్రస్మా గౌరవ అధ్యక్షులు,
బీఏఎస్ పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి