17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసిన బంజరతండ పాలకవర్గం

21-12-2025 09:58 AM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని బంజర తండ గ్రామపంచాయతీ గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్ పోతుల భూమయ్యా,వార్డ్ సభ్యులు ఎల్లారెడ్డి నియోజకవర్గము ఎమ్మెల్యే మదన్మోహన్రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ... బంజారా తండా గ్రామపంచాయతీకి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. గ్రామ పాలకవర్గం ఐక్యమత్యంతో పనిచేసి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. సంక్షేమ పథకాలు అందజేయడంలో ఏవైనా పొరపాట్లు ఏర్పడితే కాంగ్రెస్ పార్టీపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముడేరే నరేష్, సీనియర్ నాయకులు లిబియా నాయక్, తదితరులు పాల్గొన్నారు.