calender_icon.png 18 June, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధమై ఉండాలి

18-06-2025 12:00:00 AM

  1. ఎస్పీ అఖిల్ మహాజన్

గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌ను ఏఏస్పీతో కలిసి ఆకస్మిక తనిఖీ 

పోలీస్ పిల్లల కోసం చిల్డ్రన్ పార్క్ ప్రారంభం

ఆదిలాబాద్, జూన్ 17 (విజయక్రాంతి) : రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలీసులు సన్నద్ధమై ఉండాలనిబీ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు. మంగళవా రం గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌ను ఉట్నూర్ ఏఏస్పీ కాజల్‌సింగ్‌తో కలిసి ఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు.

సిబ్బందితో మాట్లా డుతూ రానున్న పంచాయతీ ఎలక్షన్‌లో ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని విలేజ్ పోలీస్ ఆఫీసర్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. గ్రామాలలో ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే సమాచారం అందేవిధంగా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. మండల పరిధిలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పర్యవేక్షించాలని తెలిపారు.

సిబ్బందికి క్రమశిక్షణ తప్పనిసరి అని, విధులలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ త్వరితగ తిన ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరిం చే విధంగా సిబ్బందిని కేటాయించి వారికి పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంపొందించే విధంగా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్లో ఉండే రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరి స్తూ ఉండాలని ఎలాంటి పెండింగ్స్ లేకుం డా చూడాలన్నారు.

ప్రతి ఒక్క రికార్డును కచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని, ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా రికార్డుల నిర్వహణ చేపట్టాలని తెలిపారు. డయల్ 100 పోలీస్ సిబ్బంది గ్రామ గ్రామాన సందర్శిస్తూ పోలీసులు తమ కోసం విధులు నిర్వహిస్తుంటార ని, పోలీసు మీకోసం కార్యక్రమాలు ఏర్పా టు చేసి ఎలాంటి అత్యవసర సమయంలో నైన డయల్ 100 ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ రాజు, ఏఎస్సై మధుకృష్ణ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.