17-06-2025 10:36:59 PM
25 కేజీల విత్తనాలు స్వాధీనం..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి శివారులో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్(CI Afzaluddin) తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చయ్యపల్లి గ్రామ శివారులో 25 కేజీల Glycolic Cotton Seeds(Spurious Seeds) పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు బుచ్చయ్యపల్లి గ్రామ శివారులో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నాడని సమాచారం మేరకు బెల్లంపల్లి వ్యవసాయ అదికారి సుద్దాల ప్రేమ్ కుమార్ తో పోలీసులు కలిసి రైడ్ చేయగా పెద్ద దుబ్బు శివారులో మాకినేని వెంకట నారాయణ పట్టుపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా కంట వారిపాలెంకు అతడు బుచ్చయ్య పల్లిలో ఉంటూ కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అతడు ఆంధ్రప్రదేశ్ నుండీ చిలకలూరిపేటకు చెందిన జగన్ నుండి Glycolic Cotton Seeds(నకిలీ పత్తి విత్తనాలు) తెచ్చి బుచ్చయ్య పల్లేలో సాగు చేస్తున్నాడు. మరిన్ని లాభాల కోసం నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నాడు. అతని దగ్గర నుండి 25 కేజీల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేసి తాళ్ల గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.