12 June, 2026 | 5:30 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

మెరుగైన సేవలు అందించాలి

12-08-2025 12:00 AM

టీజీ ఎంపీడీసీఎల్ డైరెక్టర్

నిర్మల్, ఆగస్టు 11 (విజయక్రాంతి): విద్యు త్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలని టీజీ ఎంపీడీసీఎల్ డైరెక్టర్ టి మధుసూదన్ అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని పెన్షన్ల భవనంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మండల వారీగా సమీక్షించి న డైరెక్టర్ పనులను పారదర్శకంగా వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

వ్యవసాయ కనెక్షన్లను త్వరగా మంజూరు చేయాలని లూస్ పోల్స్ ను సరిచేసి ప్రమాదవ జరగకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలని మొబైల్ యాప్ లపై ఆన్లైన్ బిల్లులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి సలియా నాయక్ అధికారులు వెంకటేశ్వర్లు నాగరాజు విద్య శాఖ సిబ్బంది ఉన్నారు