28 July, 2026 | 1:33 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

కూర్మావతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య

22-12-2025 12:00 AM

భద్రాచలం, డిసెంబర్ 21, (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసా గుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్వామివారు కూర్మావతారం లో భక్తులకు దర్శనమిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కూర్మావతారంలో స్వామివా రి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఆలయం మొత్తం భక్తులతో కలకలలాడింది.

అంతేకాకుండా క్రిస్టమస్ సెలవులు విద్యార్థులకు ప్రకటించడం, ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు రామయ్య దర్శనానికి పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు.వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యా లు కలగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టారు.