25 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత కరెంట్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు(Telangana Legislative Assembly sessions) శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సభా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ప్రభుత్వం 25 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత విద్యుత్ను(Free electricity) అందిస్తోందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నామని, ఆ బిల్లులను ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు. ఈ కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడానికి ప్రభుత్వం ఇప్పటికే రూ. 3,593 కోట్లు ఖర్చు చేసిందని భట్టి తెలిపారు. పౌరులకు అవసరమైన సేవలను అందించడంలో ప్రభుత్వ నిబద్ధతను డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.






