16-05-2025 06:45:57 PM
బైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన భూభారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కకు భైంసాలో హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావు, మాజీ ఎమ్మెల్యే జి విట్టల్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రులకు పుష్పగుచ్చం అందించారు. అనంతరం వారు భూభారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు కుంటాల మండల కేంద్రానికి బయలుదేరి వెళ్లారు.