25-01-2026 07:09:53 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజ్ పల్లి గ్రామంలో సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయఓటరు దినోత్సవం సందర్భంగా ఆదివారం సీనియర్సిటిజన్స్ దాసరి నారాయణ రెడ్డి, దాసరి బక్కారెడ్డి , ఎర్రం రాంరెడ్డి, కల్వలభీమయ్య నలుగురికి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటర్ల భాగస్వామ్యం, ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
గ్రామంలోనీ ప్రతి పౌరుడికి గల అమూల్యమైన హక్కు అందుకే మీ ఓటు మీ భద్రత- మీ బాధ్యత- మీ ఓటు మీ హక్కు- మీ వాక్కు- మీ ఓటు అవినీతిపై వేటు - అభివృద్ధికి చోటు - మీ ఓటు చూపుడు వేలితో తలరాతను మారుస్తుందని అవగాహన కల్పించడం జరిగిందన్నారు, ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాసరి మధుసూదన్ రెడ్డి, జిపిఓ సృజన, వార్డ్ మెంబర్ న్యాతరి అరవింద్, బి ఎల్ ఓ శ్రీ లత,మాధవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.