9 April, 2026 | 5:03 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

బీహార్ ఫలితాలు అందరికీ పాఠం

16-11-2025 12:00 AM

-ఇండియా కూటమి ఎంతో నేర్చుకోవాలి

-కొత్త రాజకీయ సవాళ్లకు వ్యూహాత్మక ప్రణాళిక

-ఈసీపై ఆరోపణలు కొట్టిపారేయలేం

-తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

చెన్నై, నవంబర్ 15: బీహార్ ఎన్నికల ఫలితాలు అందరికీ పాఠమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఈ ఫలితంతో ఇండియా కూటమి ఎంతో నేర్చుకోవాలని తెలిపారు. ఈ మేరకు సీఎం స్టాలిన్ ఎక్స్‌లో శనివారం పోస్టు చేశారు. అద్భుతమైన విజయం సాధించిన సీఎం నితీశ్‌కుమార్‌కు, ఎన్నికల్లో గెలుపు కోసం నిర్విరామంగా పోరాడిన ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సంక్షేమా లు, సామాజిక, సైధాంతిక సంకీర్ణాలు, స్థిరమైన ప్రచారంపై ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. ఇండియా కూటమిలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఉన్నారని, భవిష్యత్ రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక ప్రణాలిక వేసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ తీరుపై ఆయన అనేక ఆరో పణలు చేశారు. ఈ ఫలితంలో ఈసీపై వచ్చి న ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించారు.

ఈసీ ప్రతిష్ట క్షీణించిందన్నారు. ఓడిపోయిన అభ్యర్థుల్లో కూడా నమ్మకం కలిగించేలా ఎన్నికల సంఘం ఉం డాలని పేర్కొన్నారు. బీహార్‌లో రెండు దశ ల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఇందులో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 245 సీట్లకు 202 సీట్లను గెలుచుకొంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్బంధన్ కేవలం 34 సీట్లకే పరిమితమైంది.