20-06-2025 12:09:43 AM
కలెక్టర్కు ఫిర్యాదులో కాల్వ శ్రీరాంపూర్
మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి ఫిర్యాదు
పెద్దపల్లి జూన్ 19( విజయ క్రాంతి ) ప్రభుత్వ కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు చేసిన ఫిర్యాదు లో కోరారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం విధుల సమయంలో పంచాయతీ రాజ్ ఏ.ఈ.ఈ జగదీశ్ పుట్టినరోజు వేడుకలను అధికార పార్టీకి చెందిన నాయకులు, అధికారుల మధ్య జరుపుకోవడం తో ప్రజలు తీర ఇబ్బందులు పడ్డారని అవేదన తో గురువారం మాజీ జడ్పీటీసీ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్ యాదవ్, బిఆర్ఎస్ నాయకులతో కలసి కలెక్టర్ కు కలెక్టర్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారికంగా ప్రభుత్వం కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించిన అధికారులను విధులనుండి తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దానికి ఉదాహరణ గా ప్రభుత్వ కార్యాలయం లో ఏ.ఈ.ఈ జన్మ దిన వేడుకలు నిలిచాయన్నారు.
విధుల సమయంలో విధులు నిర్వహించవలసిన అధికారులు అధికార పార్టీకి చెందిన నాయకులతో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో రోజంతా జన్మదిన వేడుకలు నిర్వహించారని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విధులు నిర్వహించకుండా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న అధికారులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు శ్యామ్, బీరం రమేష్, నాగార్జున, తీగల నాగరాజు, కొమురయ్య, చందు, దేవన్న, రాజ్ కుమార్, మల్లేష్, వెంక్కన్న, రవీందర్ పాల్గొన్నారు.