11-06-2025 12:00:00 AM
‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ ద్వారా సమ్మిళిత వృద్ధిపైన, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వావలంబనపైన ప్రభుత్వం దృష్టి సారించడంతో భారతదేశ అభివృద్ధి చిత్రాన్ని చాలావరకు మార్చివేసిన మాట వాస్తవమే. అయితే, ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ మొత్తం మ్యానిఫెస్టోలో పేర్కొన్న కొన్ని ముఖ్యమైన అంశాలు విశ్లేషణీయం. వాటి ఆధారంగా తాజా వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకుంటే పలు అంశాలు బోధ పడతాయి.
ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మంత్రిమండలి ప్రమాణ స్వీకా రం చేసి ఈ జూన్ 9 నాటికి సరిగ్గా ఒక సం వత్సరం పూర్తయింది. ఎన్నికలకు ముం దు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 69 పేజీల మ్యానిఫెస్టోను ప్రచురించింది. ఇదే సమయంలో ప్రధాని మోదీ నాయకత్వం లో భారతదేశం మొత్తం మీద 11 సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకుంది. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ ద్వారా సమ్మిళిత వృద్ధిపైన, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వావలంబనపైన ప్రభుత్వం దృష్టి సారించడంతో భారతదేశ అభివృద్ధి చిత్రాన్ని చాలావరకు మార్చి వేసిన మాట వాస్తవ మే.
అయితే, ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ మొత్తం మ్యానిఫెస్టోలో పేర్కొన్న కొన్ని ముఖ్యమైన అంశాలు విశ్లేషణీయం. వాటి ఆధారంగా తాజా వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకుంటే పలు అంశాలు బోధ పడతా యి. ఇచ్చిన మాటలన్నీ ఇప్పటి కిప్పుడు నెరవేరాలని ఎవరూ ఆశించరు. కానీ, అవి ఎంతవరకు సఫలీకృతమయ్యాయో తెలుసుకోవడం ద్వారా సదరు బృహత్ లక్ష్యసా ధన ఇంకెంత దూరంలో ఉందో అర్థమవుతుంది.
ప్రధానంగా ‘గరీబ్కి థాలీ’ని రక్షించడానికిగాను తమ ప్రయత్నాలను విస్తరిస్తామ ని మ్యానిఫెస్టోలో భాగంగా పార్టీ అధిష్టాన పెద్దలు అన్నారు. కానీ, ప్రపంచ బ్యాంకు ప్రకారం ఇప్పటికింకా 7.5 కోట్లమంది భారతీయులు రోజుకు రూ.225 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. పేదరికంలోని 5% మంది రోజుకు రూ. 68 ఖర్చు చేస్తా రు. శాఖాహార థాలీ ధర సగటున రూ. 77 గా కనిపిస్తున్నది. తర్వాత నవ-మధ్యతరగతి వారికి సాధికారత కల్పిస్తామన్నారు.
కానీ, 2014 మధ్య పదేళ్లలో వారి గృహ నిర్వహణ బాధ్యతలు రెట్టింపయ్యా యి. నికర ఆర్థిక పొదుపులు గత 50 ఏండ్ల లో వారి అత్యల్ప స్థాయిలలో ఒక దానికి పడిపోయాయి. అధిక విలువ కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ పెద్దలు మాట ఇచ్చారు. కానీ, 2021 నుంచి ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం 46% మంది శ్రామిక శక్తి వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. ఐదుగురిలో దాదాపు ముగ్గురు స్వయంఉపాధి పొందుతున్నారు. దీనిని నిపుణులు ‘ఉత్తమ ఉపాధి రూపం కాదని’ కూడా పిలుస్తున్నారు. కానీ, ఆశించిన, మెరుగైన ఉద్యోగాలు దొరకనప్పుడు ఉన్నంతలో భేషైన ఉపాధిమార్గం వైపు వెళ్లక తప్పని పరిస్థితే ఎవరిదైనా.
రైతుల ఆత్మహత్యలు..
శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం గురించి కూడా బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆశావహ వాగ్దానం చేసింది. కానీ, వాస్తవ చిత్రం అలా ఉందా? 2018- మధ్య ఉపాధి సంబంధిత కార్యకలాపాల లో నిమగ్నమైన మహిళల నిష్పత్తి కేవలం 2.3 శాతం పాయింట్లు పెరిగింది. ఐదేళ్లలో ఉపాధి సంబంధిత కార్యకలాపాలకు గడిపిన సమయం కేవలం 10 నిమిషాలు మాత్రమే పెరిగింది.
మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పురుషులకంటే సగం మాత్రమే. ‘నారీ శక్తి వందన్ అధిన్యాయం’ (మహిళా రిజర్వేషన్ బిల్లు) చట్టాన్ని ఆచరణలోకి తెస్తామన్నారు. లోక్సభలో బీజే పీకి 13% మహిళా ఎంపీలు ఉన్నారు.
పై బిల్లు 2023లో ఆమోదితమైంది. అయితే, దీనిని 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కలకు అనుసంధానించారు. జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు వస్తుంది. ఈ రెండింటి తర్వాతే మహిళా సాధికారత బిల్లు అమలు ముం దుకు రావచ్చు. ‘ప్రధానమంత్రి కిసాన్’ పథకాన్ని బలోపేతం చేస్తామన్నారు.
కానీ, చిత్రంగా ఇప్పటికీ ప్రతిరోజూ 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న వార్తలు వింటున్నాం. 2018- మధ్య, గ్రామీణ ప్రాంతాల్లో నిజ వేతనాలు ఏటా 0.4% తగ్గగా, వ్యవసాయ వేతనాలు వార్షిక వృద్ధి కేవలం 0.2% మాత్రమే. పీఎం కిసాన్ కింద నిధులను రూ. 12,000కు పెంచాలని పార్లమెంటరీ కమి టీ చేసిన సూచనను ప్రభుత్వం విస్మరించింది. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడం గురించికూడా పార్టీ వాగ్దానం చేసింది.
కానీ, తయారీ రంగం వాటా విలువ 2023లో జీడీపీలో 12.3% నుంచి 2024లో 4.5%కి తగ్గింది. ఇది 2014 స్థాయిలకంటే తక్కువగా ఉంది. గత రెండు సంవత్సరాలలో, పదిమందిలో ఒక రు మాత్రమే తయారీ రంగంలో పని చేస్తున్నారు.2015 మధ్య తయారీ ‘ఎం ఎస్ఎమ్ఈ’ (మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈవెంట్స్)ల సంఖ్య కేవలం 2% కంటే కొంచెం మాత్రమే పెరిగింది.
బులెట్ రైలు ప్రాజెక్ట్..
‘కవచ్ రైలు రక్షణ వ్యవస్థ’ విస్తరణ గురించి కూడా గత ఎన్నికల మ్యానిఫెస్టో లో బీజేపీ అధినాయకులు హామీ ఇచ్చా రు. కానీ, నాలుగు సంవత్సరాలలో, కవచ్ కేవలం 2% మార్గాలలో, 1% కంటే తక్కు వ లోకోమోటివ్లలో మాత్రమే వ్యవస్థాపితమైంది. ప్రస్తుత పురోగతి రేటు ప్రకా రం, భారతీయ రైల్వే నెట్వర్క్లో కవచ్ అమలు పూర్తవడానికి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చునని నిపుణులు అంటున్నారు.
ఇక, బుల్లెట్ రైళ్ల విస్తరణ అంశం. ప్రభు త్వం 2014 రైల్వే బడ్జెట్లో రూ. 60,000 కోట్ల అంచనా వ్యయంతో బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రకటించింది. 11 సంవత్సరాల తరువాత రూ. 71,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన తర్వాత సగం కంటే తక్కువ ప్రాజెక్ట్ మాత్రమే పూర్తయింది. ఎక్స్ప్రెస్ వేలు, రింగ్ రోడ్ల విస్తరణ ఏమంటున్నట్టు? 2017లో, ప్రభుత్వం ‘భారతమాల పరియోజన’ కింద 34,800 కి.మీ.లను మం జూరు చేసింది.
అయితే, ఇందులో సగం మాత్రమే ఇప్పటికి పూర్తయింది. ప్రాజెక్టు లో దాదాపు 25% ఇంకా మంజూరు కాలే దు. ఇక, సజావుగా కనెక్టివిటీ కోసం విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని అన్నా రు. కానీ, ఆశ్చర్యంగా మూడు సంవత్సరా లు పూర్తి కాకముందే 114 మార్గాలు నిలిపివేత బారిన పడ్డాయి. 619 మార్గాలు ప్రారంభమయ్యాయి. వాటిలో సగం ప్రస్తుతం ఉడాన్ కింద పని చేస్తున్నట్టు తెలుస్తున్నది.
కోర్టు వరకూ వెళ్లే ఈడీ కేసులు
‘అవినీతిని ఎదుర్కోవడం’ హామీ గురిం చి జరిగిందేమిటో తెలుసుకుందాం. గత దశాబ్దంలో, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీ య నాయకులపై ఈడీ ద్వారా 193 కేసులలో రెండు మాత్రమే దోషులుగా నిర్ధారి తమైనాయి. గత 11 సంవత్సరాలలో, ఈడీ మొత్తం 5297 కేసులు దాఖలు చేసింది. 47 కేసులను మాత్రమే విచారణ కోసం కోర్టుకు తీసుకెళ్లారు. దాఖలు అయిన ప్రతి 1000 కేసులకు, నిందితులు ఏడు కేసుల లో మాత్రమే దోషులుగా తేలినట్టు సమాచారం.
‘ఎయిమ్స్’ (ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను బలోపేతం చేయడం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాం. భారతదేశం అంతటా ఎయిమ్స్ ఆసుపత్రులలో 18,737 స్థానా లు (వివిధ స్థాయిలవి) ఖాళీగా ఉన్నాయి. వీటిలో 2200 కంటే ఎక్కువ అధ్యాపకుల కు సంబంధించినవి. ఇవి భర్తీ అయితే తప్ప సేవలు విస్తృతం కావు. ఇక, యువతకు నైపుణ్య శిక్షణను విస్తరిస్తామన్న హామీ. భారతదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు (యువకులు) విద్య, ఉపాధి లేదా శిక్షణలో లేరు. వీళ్లలో 95% మంది మహిళలు ఉండటం విశేషం.
యువజన శ్రామిక శక్తిలో కేవలం 4% మంది మాత్రమే అధికారిక నైపుణ్య శిక్షణ పొందినట్టు సమాచా రం.పీఎం ఇంటర్న్షిప్ పథకం కింద అయి దు జిల్లాల్లో ఒక జిల్లాకు 10 కంటే తక్కువ ఇంటర్న్షిప్ అవకాశాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఈశాన్య భారతంలో శాంతిని కాపాడతామని కూడా బీజేపీ హా మీ ఇచ్చింది. కానీ, మణిపూర్లో హింసకు కారణమేదైనా, అది ప్రారంభమై రెండు సంవత్సరాలకు పైగా అవుతున్నది. ప్రధాన మంత్రి మోదీ ఒక్కసారి కూడా మణిపూర్ను సందర్శించలేదన్న ప్రతిపక్షాల విమ ర్శలో బలం లేదా అంటే సమాధానం బీజే పీ వారినుంచి శూన్యం.
గడీల ఛత్రపతి