calender_icon.png 20 June, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాయిదా వైఖరి నష్టదాయకం!

11-06-2025 12:00:00 AM

సర్వమాత్యయికం కార్యం 

శృణుయాన్నాతి పాతయేత్

కృఛ్ఛ్రసాధ్యమతి క్రాంత 

మసాధ్యం వా విజాయతే॥

కౌటిలీయం, చాణక్య (1.19) “తక్షణం చేయవలసిన కార్యాన్ని వెంట నే వినాలి, చేయాలి, వాయిదా వేయకూడ దు. అలా దాటవేసిన కార్యం తదుపరి అతికష్టంపై సాధ్యపడవచ్చు లేదా అసాధ్య మూ కావచ్చు” అంటాడు ఆచార్య చాణ క్య. నాయకుడు స్వార్థపరుడైనా, కార్యాల ను వాయిదా వేసే గుణం కలిగిన వాడైనా సంస్థ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉం టుంది. సమయానికి వేసిన ఒక కుట్టు తొమ్మిదింటిని కాపాడుతుందని సామెత.

వినియోగదారులను, ఉద్యోగులను సం తృప్తి పరచలేని సంస్థ ప్రగతి ప్రశ్నార్థకమే. ఇవాళ ఏ రంగమైనా ప్రతిభను నిరూపించుకో లేదా తప్పుకో అనే వాతావరణంలో ముందుకు సాగుతుంది. ఒప్పందం ప్రకా రం వినియోగదారునికి నాణ్యమైన ఉత్పత్తులు/ సేవలు సమయానికి అందించలేని సంస్థ విశ్వసనీయతను కోల్పోతుంది. విపణివీధిలో పక్కకు నెట్టివేయబడుతుంది.

నాణ్యమైన వస్తు ఉత్పత్తి/ సేవలను అందించగలిగిన నూతన ఆవిష్కరణ సా మర్థ్యం మాత్రమే ఈరోజుల్లో ప్రపంచ వ్యాపార రంగంలో నిలబడ గలుగుతుం ది. దానికి వనరులుగా రాజకీయ, ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించ గలిగిన వ్యవస్థలను చెప్పుకోవాలి. ఇది సాంప్రదాయిక వైజ్ఞానిక సాంకేతిక సామర్థ్యాలకన్నా భిన్నమైంది. అంటే, పౌరుల విభిన్న సామర్థ్యాల ను దేశ ఆర్థిక ప్రగతికి అనువర్తింప చేయ డం ఎలాగో తెలుసుకునే నూతన ఆవిష్కరణలను ఆలోచించాలి.

ఆ సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. దానికి ప్రభుత్వ, ప్రైవే టు, విద్యా రంగాల మధ్య సమన్వయం సాధించాలి. మానవ వనరులను క్రమబద్ధీకరించు కోవడం, అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం, క్రమశిక్షణతో వాటిని సద్వినియోగం చేసుకోవడం అవసరం. ఈ ప్రక్రియలో వీలైన మేరకు ఇతరుల మధ్యవర్తిత్వాన్ని తొలగించి, సరఫరాదారుతో ప్రత్యక్షంగా ఒప్పందం కుదు ర్చుకొని పనులను అప్పగించాలి.అప్పుడు సొమ్ము, సమయమూ ఆదా అవుతాయి.

సకాలానికి సరైన పని!

ఈ మధ్య వాయుసేనాధిపతి “సంతకా లు మాత్రమే అవుతాయి, సరఫరాలు ఉండవు. ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు” అన్నారు. దానికి కారణం, వారు అప్పగించిన పనిని ఒక ప్రభుత్వరం గ సంస్థ చాలా సంవత్సరాలకు కూడా అం దించలేదు. దాంతో దాని సాంకేతికతకు కాలం చెల్లింది. వాడుకలో లేని ఉత్పత్తులు దేనికి ఉపకరిస్తాయి! ప్రభుత్వరంగ సంస్థ అయినా, ప్రైవేటురంగ సంస్థ అయినా ఒప్పందం ప్రకారం నాణ్యతా ప్రమాణాల కు అనుగుణంగా ఉత్పత్తులను వినియోగదారునికి సకాలంలో అందించాలి.

అందించలేక పోవడానికి సంస్థకు అనేక కారణాలు ఉండవచ్చు. వాటితో వినియోగదా రునికి సంబంధం లేదు. ఒక సాంకేతిక విధానంలో ఉత్పత్తిని కోరిన వినియోగదారునికి సకాలంలో ఆ ఉత్పత్తి అందక బాగా ఆలస్యమైతే ఆ వస్తువుల సాంకేతికతకు కాలం చెల్లిపోవచ్చు. దాంతో వినియోగదారుడు నష్టపోతాడు. సంస్థ విశ్వసనీయత పోతుంది. దేశాభ్యుదయానికి అవసరమైన సంపదను సృష్టించడంలో ప్రభుత్వరంగ సంస్థలు కీలకపాత్రను పోషించాలి.

కానీ, నేడు వ్యాపార రంగంలో ప్రైవేట్ రంగ సం స్థలతో పోటీ పడుతున్న ప్రభుత్వరంగ సం స్థల పనితీరు నాసిరకంగా ఉంటుంది. (2017- నుంచి 2021 వరకు ప్రభుత్వరంగ సంస్థల నష్టాలు దాదాపు 1.54 లక్షల కోట్లుగా అంచనా.) కారణాలు ఎన్నున్నా, ప్రభుత్వాల అవినీతి, మితిమీరిన రాజకీయ జోక్యం, ఉద్యోగులలో జవాబుదారీతన లోపం ప్రధానమైనవి. 

నిజానికి అవినీతి అంతరాత్మపై అత్యాచారం లాంటిది. ఉద్యోగ భద్రత, పనిచేసి నా చేయకపోయినా నెలవారీ జీతభత్యా లు వస్తాయనే ధీమా, అలసత్వం, పని చేసి న వారికి మరింత పని ఇస్తారనే భావన, కొత్త సాంకేతిక విధానాన్ని నేర్చుకునేందుకు ఆసక్తి లేక పోవడం, విడతల వారీగా కొత్తవారికి ఉపాధి కల్పించి, నూతన సాం కేతికతను, పాతతరం అనుభవాన్నీ మిళితం చేయలేని నాయకత్వ అసమర్థ్ధత, నిధు ల దుర్వినియోగం,

ఆధునిక సాంకేతిక విధానంలో శిక్షణను అందించలేక పోవ డం, ప్రేరణనిచ్చి పనిపై అభిరుచి కల్పించే నాయకత్వ లోపం, ప్రతిభ ఆధారంగా నియామకం జరగవలసిన ఉన్నత స్థానాలలో అసమర్థులను కూర్చోబెట్టడం, సకా లంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోవ డం లాంటి పలు కారణాలు ప్రభుత్వరంగ సంస్థల పనితీరును అపహాస్యం చేస్తున్నా యి.

ఉత్పత్తి నిర్వహణలలో అవసరమైన శిక్షణను నిర్ణీత కాలావధులలో అందించలేక పోవడం వల్ల సమస్యలు అధికంగా వచ్చిన సమయంలో వాటిని నిర్వహించుకునే నైపుణ్యం ఉన్నత స్థాయి అధికారుల లో లోపిస్తున్నది. సైకిల్ నడిపే వారిని మోటార్ సైకిల్, మోటార్ సైకిల్ నడిపే వారిని విమానాన్ని నడపమనడం లాగే ఉత్పత్తిపట్ల అవగాహన, నైపుణ్యం లేని వారికి బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది.

కొత్తగా విద్యాభ్యాసం చేసిన వారికి నవీన సాంకేతికత పట్ల అవగాహన ఉం టుంది. అయితే, ఆ అవగాహన ఆచరణాత్మకంగా ఉండాలి అంటే అనుభవ జ్ఞాన మూ అవసరమే. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులతో పోల్చుకుంటే ప్రైవేటురంగ సంస్థలలో పనిచేసే వారికి వేతనా లు అధికంగా ఉంటాయి. దానితో ఉన్నత ప్రమాణాలతో కూడిన ప్రతిభ ప్రైవేటు పరమవుతుంది. అయితే, బాధ్యతతో పని చేస్తూ, ఉత్తమ ఫలితాలను అందిస్తున్న పలు ప్రభుత్వరంగ సంస్థల సేవలను గుర్తించాల్సిందే.

వెనుకబడి పోవడానికి అసలు కారణం

హృదయ పూర్వకంగా ఆహారాన్ని తయారు చేయకపోతే అది ఆకలిని తీరుస్తుందేమో కాని ఆస్వాదనకు పనికిరాదు. తప్పెక్కడ జరుగుతుందో తెలుసుకునే దానికన్నా తనది ఆ బాధ్యత కాదని తప్పుకునే ఉద్యోగులు పనిని ప్రేమించలేరు. పని ని ప్రేమిస్తూ, పని చేయడంలో ప్రేరణను పొందలేని ఉద్యోగులవల్ల సంస్థ నిర్జీవమవుతుంది. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగు లకు జీతభత్యాలు ప్రజలు కట్టే పన్నులవల్లనే లభిస్తాయి.

దానిని గుర్తించలేక, బాధ్య తా రాహిత్యంతో, జవాబుదారీతనం లేకుండా.. పనిపై ఆసక్తిని కనపరచక పోవడమే ప్రభుత్వ సంస్థలు నష్టాల ఊబిలో చేరడానికి ప్రథమ కారణంగా భావించాలి. దీపాలలో వైవిధ్యం ఉండవచ్చు కానీ, అవి ప్రసరింపచేసే కాంతి మాత్రం ఒక్కటే. సకారాత్మకమైన స్పర్ధ, విజ్ఞానం, సాంకేతికత, సృజనాత్మకతలు పరస్పరం సహకరించుకున్నచోట అభ్యుదయం ఉంటుంది. 

ప్రభావశీలమైన ప్రక్రియ, సుస్పష్టమైన ఫలితాలను దర్శిస్తూ నిబద్ధతతో ముందు కు సాగితే, ప్రజ్ఞ జాగృతమవుతుంది. ప్రజ్ఞ ఆదరణతో ప్రేరణను అందిస్తే అద్భుతమైన ఫలితాలు ఆవిష్కారమవుతాయి. అన్ని వాతావరణాలకు అన్ని ఉత్పత్తులు సరిపోకపోవచ్చు. వాటిని సమన్వయం చేయవలసిన అవసరం ఉన్నప్పుడు సమర్థత గలిగిన బయటి సంస్థలకు ఆ పను లను అప్పగించడం వల్ల నాయకులకు సరైన వ్యూహాలను ఆలోచించుకునే సమయం లభిస్తుంది.

నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని విభాగాల నుండి సేకరించిన విడిభాగాలను ఒక్కచోట కూర్చి వాటి నాణ్యత ను, పని విధానాన్ని పరిశీలించి సకాలంలో వినియోగదారునికి అందించడంలో సంస్థ విజయం సాధిస్తే అది సంస్థ విశ్వసనీయతను కాపా డటమేకాక జాతీయ సంపదనూ పెంచుతుంది.