10 April, 2026 | 3:55 PM

Breaking News

టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి   •   అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •  

తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం

03-01-2026 12:00 AM

హుజూర్ నగర్, జనవరి 2: తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేసేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని లింగగిరి గ్రామ సర్పంచ్ మేడి సునీతరమణ,ఉప సర్పంచ్ చలమల సతీష్,గ్రామ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఎండి హఫీజా నిజామోద్దీన్,గ్రామ అధ్యక్షులు చల్లమల్ల రాఘవయ్య,  కోరారు. శుక్రవారం మండల పరిధిలోని లింగగిరి  గ్రామంలో షేక్ ముజ్జు జ్ఞాపకార్ధంగా అతని స్నేహితులు, లింగగిరి యూత్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కొరకు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు...

తలసేమియా బాధితులకు నేడు రక్తం దొరకడం కష్టంగా మారిందన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.రక్తదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ముస్తఫా,వార్డు మెంబర్లు, తదితరులు, పాల్గొన్నారు.