16-08-2025 12:02:43 AM
అయిజ ఆగష్టు 15. 79 వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో బ్రాహ్మరెడ్డి హాస్పిటల్ దగ్గర రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా బిజెపి జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి హాజరై రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందచేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు 18సంవత్సరాలనుండి 60 సంవత్సరాల మధ్య గల వారందరు రక్తదానం చేయాలనీ సేకరించి న రక్తం ను ఆపదలో ఉన్న వారికీ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ సొసైటీ తహెర్, బీజేపీ పట్టణ & మండల అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి, గోపాలకృష్ణ, , ౄr నవీన్, డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.