17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఖాశింపేట గ్రామ శివారులో మృతదేహం గుర్తింపు.. అనుమానాస్పద మృతి

14-10-2025 10:52 PM

చివ్వెంల (విజయక్రాంతి): ఖాశింపేట గ్రామ శివారులో మంగళవారం మృతదేహం గుర్తించడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడు మేడబోయిన శివ శంకర్(31), తండ్రి యల్లయ్య, వృత్తి ఆపరేటర్, సుధాకర్ పివిసి వద్ద పనిచేస్తూ ఉండ్రుగొండ గ్రామం, చివ్వెంల మండలానికి చెందినవాడు. ఈ రోజు ఖాశింపేట శివారులో శివ శంకర్ మృతదేహం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుని తండ్రి మేడబోయిన యల్లయ్య(55) తండ్రి ముత్తయ్య ఫిర్యాదు మేరకు చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కనక రత్నం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మరణ కారణాలను నిర్ధారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని కోరుతున్నారు.