28 August, 2026 | 2:36 PM

Breaking News

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి   •   మల్లాపూర్‌లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన నామనాగేశ్వరరావు   •   కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు   •   ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు   •   రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు   •   ప్రధాని మోదీ, తల్లిదండ్రులపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్ట్   •   ఎమ్మెల్యే పోచారంకు రాఖీ కట్టిన సోదరిమణి దొడ్ల సత్యవతి   •   విద్యుత్ పోరాట అమరవీరుల స్పూర్తితో భవిష్యత్ పోరాటాలు   •   ప్రయాణికుల కష్టాలు తీర్చేలా ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి   •  

వర్షంలో యూరియా కోసం రైతుల అగచాట్లు..

01-09-2025 12:41 PM

యూరియాను కూరలో ఉప్పులా వాడాలా.

స్థానిక రైతు కనికి రెడ్డి.

రేగొండ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని పిఎసిఎస్(PACS) గోదాం వద్ద రైతులు యూరియా కోసం అగచాట్లు పడ్డారు. సోమవారం వర్షం పడుతున్నా లెక్కచేయకుండా యూరియా బస్తాల కోసం ఉదయం నుండే మండల ప్రజలు బారులు తీరారు. దీంతో ఒక్కసారిగా పిఎసిఎస్ గోదాం వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసులు చొరవ తీసుకొని రైతులను క్యూ లైన్ లో నిల్చోబెట్టారు. రైతులు మాత్రం ప్రభుత్వంపై మండిపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో యూరియాను అందజేయడంలో పూర్తిగా విఫలమైందని రైతుల కష్టాలు పట్టించుకునే నాయకులే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పాస్ బుక్ పై ఒక్క యూరియా బస్తానే ఇవ్వడం ఏంటని నిలదీశారు. మూడు రోజులు యూరియా కోసం పడి గాపులు కాస్తే మా మొఖాన ఒక్క బస్తా పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

యూరియాను కూరలో ఉప్పులా వాడాలా. 

స్థానిక రైతు కనికి రెడ్డి.

సీఎం రేవంత్ రెడ్డికి రైతులపై చిత్తశుద్ధి లేదు.నాకు 5 ఎకరాల సాగు ఉంది ఒక్క బస్తా ఇస్తానంటున్నారు. ఒక్క బస్తాను కూరలో ఉప్పు వాడినట్లు వాడాలా. తెల్లారి లేస్తే సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో బుర్రుమని తిరుగుతావ్. జర మా రైతుల మొఖాన చూడు మా గోస కనబడుతది. మార్పు రావాలి మార్పు రావాలి అంటే యూరియా కోసం రైతులు లైన్లో నిల్చునే మార్పు వచ్చింది.