calender_icon.png 4 September, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతుల ఆందోళన

01-09-2025 12:51:55 PM

క్యూ లైన్ లో నిలబడిన అందని యూరియా బస్తాలు

పోలీసుల బందోబస్తు మధ్య యూరియా పంపిణీ 

కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు చేసిన రైతులు 

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తుంది. సరిపడా యూరియా స్టాకు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి యూరియా కోసం క్యూ లైన్ కట్టిన సరిపడ యూరియా బస్తాలను ఇవ్వడం లేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District)లోని మాచారెడ్డి, పెద్ద మల్లారెడ్డి, రాజంపేట, తాడువాయి, బిక్కనూర్, సదాశివనగర్ మండల కేంద్రాల్లోని విండో కార్యాలయాల ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఇదే ఆసరాగా చేసుకున్న వ్యాపారులు రైతులకు గడ్డి మందు కొనుగోలు చేస్తేనే యూరియా బస్తాలు అంటగడుతున్నారు. దీంతో రైతులు అవసరం లేకుండా గడ్డి మందును కొనుగోలు చేయడంతో పాటు యూరియా బస్తాలను కొనుగోలు చేస్తున్నారు. గడ్డి మందు వ్యాపారులు షరతులు విధించడంతో రైతులకు గడ్డి మందు డబ్బులతో పాటు యూరియా బస్తాకు కలిపి 2700 చెల్లించాల్సి వస్తుంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారులు సిండికేట్ గా మారి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు, విండో కార్యాలయం అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి సింగల్ విండో కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియా స్టాకు లేదని లేదని విండో అధికారులు చెప్పడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా బస్తా కోసం క్యూ కట్టిన ఒక యూరియా బస్తా కూడా అందుతుందా లేదా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. ఒక్కో విండో పరిధిలో నాలుగు గ్రామాల రైతులు ఉండడంతో యూరియా కోసం నాలుగు గ్రామాల రైతులు వచ్చి క్యూలైన్లో వేచి చూస్తున్నారు. ముందుగా వచ్చిన వారికి యూరియా బస్తాలు అందుతున్నాయని ఆలస్యంగా వచ్చినవారికి సాయంత్రం వరకు వేచి చూసిన యూరియా బస్తాలు అందడం లేదని రైతులు తెలిపారు.

ప్రతిరోజు కామారెడ్డి జిల్లాలో ఎక్కడో ఒకచోట యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడడం ఇబ్బందులు పడడం జరుగుతుంది. అధికారులు మాత్రం నిమ్మకు నేరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని రైతుల ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని స్టాక్ లేని సొసైటీల వద్ద కు అదనంగా యూరియాను ఇప్పించాలని తెప్పించాలని రైతులు కోరుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. తాడువాయి, భిక్కనూర్, మాచారెడ్డి, రాజంపేట, ఎర్ర పహాడ్, తదితర విండోల లో యూరియా తగినంత  స్టాక్ లేక రైతులు తంటాలు పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలైన్లలో నిలబడి యూరియా కోసం పడిగాపులు కావలసి వస్తుందని రైతులు అంటున్నారు. సదాశివ నగర్ లో రైతులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపించారు.